ఏపీలో 7లక్షలు దాటిన కరోనా కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Oct 2020 12:22 PM GMT
ఏపీలో 7లక్షలు దాటిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 71,577 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 6,751 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,00,235కి చేరింది.

కొవిడ్‌ వల్ల చిత్తూరులో ఏడుగురు, కృష్ణలో ఆరుగురు, ప్రకాశంలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, అనంతపూర్‌లో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, కడపలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, నెల్లూరులో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒక్కరు చొప్పున 41 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 5,869కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 6,36,508 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 57,858 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 333,

చిత్తూరులో 888,

ఈస్ట్‌ గోదావరిలో 986,

గుంటూరులో 594,

కడపలో 400,

కృష్ణలో 424,

కర్నూలులో 265,

నెల్లూరులో 472,

ప్రకాశంలో 783,

శ్రీకాకుంలో 301,

విశాఖపట్నంలో 277,

విజయనగరంలో 275,

పశ్చిమ గోదావరి 753 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story