ఏపీలో విజృంభిస్తోన్న క‌రోనా.. కొత్త‌గా మ‌రో 62 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 April 2020 8:07 AM GMT
ఏపీలో విజృంభిస్తోన్న క‌రోనా.. కొత్త‌గా మ‌రో 62 కేసులు

ఆంధ్రప్రదేశ్ క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ రోజు కొత్త‌గా మ‌రో 62 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా కేసుల సంఖ్య 955కి చేరింది. మొత్తం న‌మోదైన కేసుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 145 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 781 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మ‌హ‌మ్మారి బారీన ప‌డి 29 మంది మృత్యువాత ప‌డ్డారు.

కొత్త‌గా న‌మోదైన కేసుల్లో క‌ర్నూలు జిల్లాలో అత్య‌ధికంగా 27 కేసులు న‌మోదు కాగా.. కృష్ణాలో 14, గుంటూరులో 11, అనంపురంలో 4, తూర్పు గోదావరిలో 2, నెల్లూరు జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 3 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కేవ‌లం మూడు జిల్లాల్లోనే అత్య‌ధిక కేసులు న‌మోద‌య్యాయి. కర్నూలు జిల్లాలో 261, గుంటూరు జిల్లాలో 206, కృష్ణా జిల్లాలో 102 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

Corona positive cases rises in AP

Next Story