భార‌త్‌లో 16వేలు దాటిన క‌రోనా కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 April 2020 2:41 PM GMT
భార‌త్‌లో 16వేలు దాటిన క‌రోనా కేసులు

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఇక భార‌త్‌లోనూ క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 1,334 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 27 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో మొత్తంగా దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,116 కు చేరింది. ఇక ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి 519 మంది మృతి చెందారు. ఇక‌.. మొత్తం బాధితుల్లో 2,231 మంది కోలుకోని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయిన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

క‌రోనా పాజిటివ్ అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో న‌మోద‌వుతున్నాయి. ఈ రాష్ట్రంలో 3,651 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 211 మంది మృత్యువాత ప‌డ్డారు. ఢిల్లీలో 1893 కేసులు న‌మోదు కాగా.. 43 మంది మ‌ర‌ణించారు. గుజ‌రాత్‌లో 1604 కేసులు న‌మోదు కాగా.. 58 మంది మ‌ర‌ణించారు. మ‌ధ్య ప్ర‌దేశ్ లో 1407 కేసులు న‌మోదు కాగా.. 70 మంది మృత్యువాత ప‌డ్డారు. త‌మిళ‌నాడులో 1372, రాజ‌స్థాన్‌లో 1351, యూపీలో 1084 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

Next Story