అన్ని సేవలు రద్దు.. NDMAకు కేంద్రం బాధ్యతలు
By అంజి Published on 24 March 2020 8:57 PM GMTఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ మినహా అన్ని సేవలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. అయితే వాటి నిర్వహణ బాధ్యతలను కేంద్రప్రభుత్వం.. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు అప్పజెప్పింది. ఈ విషయాన్ని ప్రకటించిన కేంద్ర హోంశాఖ.. పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.
కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం..
*కేంద్ర పార మిలటరీ బలగాలు, ఇంధన, గ్యాస్, విద్యుత్, తపాల, ట్రెజరీ, సమాచార వ్యవస్థ, ముందస్తు హెచ్చరికల కేంద్రాలు, విపత్తు నిర్వహణ మినహా అన్ని వ్యవస్థలను మూసివేయాలి. కేంద్ర ప్రభుత్వ, స్వతంత్ర వ్యవస్థల్లో సేవలను పూర్తిగా నిలిపివేయాలి.
*ఇక రాష్ట్రాల్లో పోలీస్, హోంగార్డ్స్, పౌరరక్షణ, ఫైర్ సెఫ్టీ, జైళ్లు, డిస్ట్రిక్ అడ్మినిస్ట్రేషన్, ట్రెజరీ, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం మినహా అన్ని సేవలు నిలిపివేయాలి.
*ఆహార పదార్థాలు, పండ్లు, కురగాయలు, పాలు, మాంసం దుకాణాలను వీటి నుంచి మినహాయింపు వర్తించనుందని కేంద్ర హోంశాఖ తెలిపింది. అలాగే ఆస్పత్రులు.. వాటి అనుబంధ వ్యవస్థలు యాధావిధిగా పనిచేయనున్నాయి.
*ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, టెలీ కమ్యూనికేషన్, ఇంటర్నెట్, బ్యాంక్లు, ఏటీఎంలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.
* ఈ-కామర్స్, శీతల కేంద్రాలు, నిత్యావసరాల తయారీ యూనిట్లు, గిడ్డంగులు, పెట్రోల్ పంపులకు మినహాయింపు కల్పించారు.
Also Read: అర్థం చేసుకోండి.. యుద్ధం సమయంలో కూడా రైలు ఆగలేదు
పబ్లిక్ ట్రాన్స్పోర్టును పూర్తిగా నిలిపివేయాలని.. అలాగే సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, సాంస్కృతిక సేవలను కూడా రద్దు చేయాలని పేర్కొంది.
ఈ నిబంధనలన్నీ అమలయ్యేలా చూసే బాధత్య ప్రతి జిల్లా న్యాయాధికారికి అప్పగించారు. అర్థరాత్రి 12 గంటల నుంచి నిబంధనలు అమలులోకి వచ్చాయి.