సోషల్‌ మీడియా యాప్స్‌ పై క్రిమినల్‌ కేసు నమోదు..!

By సుభాష్  Published on  27 Feb 2020 10:56 AM GMT
సోషల్‌ మీడియా యాప్స్‌ పై క్రిమినల్‌ కేసు నమోదు..!

దేశంలో ప్రధాన సోషల్ మీడియా యాప్స్‌ అయిన వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్ లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు 14 వ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ సైబర్ క్రైమ్ పోలీసులకు కేసు నమోదు చేయమని ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్ సీసీఎస్‌లోని సైబర్ క్రైం పోలీసులు ఎఫ్ఐఆర్ నెంబర్ 374/2020 నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. సీనియర్ జర్నలిస్ట్ సిల్వేరి శ్రీశైలం సదరు యాప్స్ పై ఫిర్యాదు చేశారు. ఆమేరకు స్పందించిన కోర్టు, తక్షణ విచారణ ఉత్తర్వులు జారీ చేసింది. గత సంవత్సరం డిసెంబర్ 12న భారత పార్లమెంట్ లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా సదరు సోషల్ మీడియా యాప్స్ శాసనాన్ని ధిక్కరిస్తూ దేశవ్యతిరేక ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నాయని శ్రీశైలం తొలుత హైదరాబాద్ నగర పోలీస్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమీషనర్ మహంతిని కలసి ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా గ్రూప్స్ లో సున్నితమైన మతపరమైన అంశాలను రెచ్చగొడుతూ, దేశ వ్యతిరేక కార్యక్రమాలకు సోషల్ మీడియా యాప్ లైన వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్ లు వేదిక అవుతుందని శ్రీశైలం తన ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఇందుకు కొన్నివాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్ గ్రూప్ ల వివరాలను కూడా ఫిర్యాదులో జత చేశారు. వీటన్నిటిని పరిశీలించిన మేజిస్ట్రేట్.. సైబర్ పోలీసులకు రిఫర్ చేశారు. దీంతో సోషల్ మీడియా యాప్స్ పై కేసులు నమోదైనట్లైంది. ఈ కింది ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్ 153A, 121 A, 124, 124 A, 294, 295 A, 505, 120 B, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000, సెక్షన్ 66A క్రింద కేసు నమోదు అయ్యియాయి.

Socaial

Next Story