యజమాని పై కోపంతో కారును దగ్ధం చేసిన డ్రైవర్

By Newsmeter.Network  Published on  26 Dec 2019 6:21 AM GMT
యజమాని పై కోపంతో కారును దగ్ధం చేసిన డ్రైవర్

యజమానిపై కోపంతో కారును దగ్ధం చేసిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేస్తుకుంది. కింగ్ కోఠి లోని ఒక ఫంక్షన్ కు వెళ్లిన కారు యజమాని మాజ్ తన కారును రోడ్డు పక్కన పార్క్ చేసి లోపలకు వెళ్ళాడు. ఇదే అదునుగా భావించిన కారు డ్రైవర్ హుస్సేన్.. తనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు తో కలిసి కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను ఆర్పారు. వాహనం పూర్తిగా కాలిపోయినదని పోలీసులు తెలిపారు. కారును తగలబెట్టిన హుస్సేన్ తో సహా ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగేళ్ల క్రితం కూడా హుస్సేన్ పై కారుదగ్థం చేసిన కేసు ఉందని పోలీసులు తెలిపారు.

Next Story