షాక్‌.. పెరిగిన బంగారం ధ‌ర

September 30th Gold price.ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయి అన్న సంగ‌తి తెలిసిందే. ఓ రోజు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Sep 2021 2:12 AM GMT
షాక్‌.. పెరిగిన బంగారం ధ‌ర

ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయి అన్న సంగ‌తి తెలిసిందే. ఓ రోజు ధ‌ర పెరిగితే.. మ‌రో రోజు త‌గ్గుతూ ఉంటుంది. ఇక భార‌తీయుల‌కు ప‌సిడి అంటే మ‌క్కువ ఎక్కువ‌. ధ‌ర‌లు పెరిగిన‌ప్ప‌టికి కొనుగోలు చేసేందుకు వెన‌కాడ‌రు. ఇక తాజాగా బంగారం ధ‌ర పెరిగింది. గురువారం ప‌ది గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.60 నుంచి రూ.360 దాకా పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల‌ను బ‌ట్టి పెరుగుద‌ల ఉంటుంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,460

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,460

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130

- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,200, 24 క్యారెట్ల ధర రూ.47,130

బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.

వెండి ధ‌ర‌లు ఇలా..

ఇక ప‌సిడి బాట‌లోనే వెండి కూడా ప‌య‌నిస్తోంది. వెండి ధ‌ర స్వ‌ల్పంగా పెరిగింది. ఢిల్లీలో కిలో వెండి రూ.60,450 ఉండగా, చెన్నైలో రూ.64,800, ముంబైలో రూ.60,450, కోల్‌కతాలో రూ.60,450, బెంగళూరులో రూ.60,450, హైదరాబాద్‌లో రూ.64,800 గా ఉంది.

Next Story