ప‌సిడి ప్రియుల‌కు షాక్‌.. పెరిగిన బంగారం ధ‌ర‌

September 28th Gold price.ప‌సిడి కొనుగోలు దారుల‌కు ధ‌ర‌లు షాకిస్తున్నాయి. గ‌త రెండు రోజులుగా స్థిరంగా ఉన్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Sep 2021 1:56 AM GMT
ప‌సిడి ప్రియుల‌కు షాక్‌.. పెరిగిన బంగారం ధ‌ర‌

ప‌సిడి కొనుగోలు దారుల‌కు ధ‌ర‌లు షాకిస్తున్నాయి. గ‌త రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధ‌ర నేడు స్వ‌ల్పంగా పెరిగింది. మంగ‌ళ‌వారం 10 గ్రాముల బంగారం ధ‌ర పై రూ.40 నుంచి రూ.160 మ‌ధ్య పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల ఆధారంగా ప‌సిడి పెరుగుద‌ల‌లో మార్పులు ఉంటాయి. ఇక బంగారం బాట‌లోనే వెండి కూడా న‌డిచింది. కిలో వెండి ధ‌ర‌పై రూ.600 పెరగడంతో ధర రూ.64,100 నుంచి రూ.64,700 ధరకు చేరుకుంది

ప్రధాన నగరాల్లో ప‌సిడి ధరలు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,280, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,280

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,450

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,290

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,290

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,290

- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,350, 24 క్యారెట్ల ధర రూ.47,290

బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.

Next Story