స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌

September 23rd Gold Price.ప‌సిడి అంటే భారతీయుల‌కు మ‌క్కువ ఎక్కువ‌. బంగారాన్ని కొన‌గోలు చేసేందుకు ఎక్కువ‌గా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Sep 2021 2:15 AM GMT
స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌

ప‌సిడి అంటే భారతీయుల‌కు మ‌క్కువ ఎక్కువ‌. బంగారాన్ని కొన‌గోలు చేసేందుకు ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తుంటారు. ఆర్థిక అవ‌స‌రాల్లో బంగారం త‌మ‌ను ఆదుకుంటుంద‌ని బావించ‌డ‌ట‌మే అందుకు కార‌ణం. కొంత కాలంగా బంగారం ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఇదిలా ఉంటే.. గ‌త రెండు రోజులుగా బంగారం ధ‌ర పెరుగుతోంది. నేడు ప‌సిడి ధ‌ర పెరిగింది. గురువారం 10గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.30 నుంచి రూ.350 వ‌ర‌కు పెరిగింది. దేశీయంగా ఆయా ప్రాంతాలను బ‌ట్టి ప‌సిడి ధ‌ర‌ల్లో పెరుగుద‌ల న‌మోదు అయ్యింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,360, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,360

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,840

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,900

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,840

ఇక బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కార‌ణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story