సామాన్యుడి జేబుకు చిల్లు.. వ‌రుస‌గా మూడో రోజు పెరిగిన ఇంధ‌న ధ‌ర‌లు

Petrol price hike consecutive third today.దేశంలో అలా ఎన్నిక‌ల ప‌ర్వం ముగిసిందో లేదో ఇటు వ‌రుస‌గా మూడో రోజు కూడా పెట్రో ధ‌ర‌లు పెరిగాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 May 2021 3:26 AM GMT
Fuel Prices Hike In India

దేశంలో అలా ఎన్నిక‌ల ప‌ర్వం ముగిసిందో లేదో ఇటు పెట్రోలు ధ‌ర‌లు మ‌ళ్లీ పెర‌గ‌డం మొద‌ల‌య్యాయి. ఫ‌లితాలు వెలువ‌డిన మ‌రుస‌టి రోజు నుంచే దేశీయ చ‌మురు కంపెనీలు ధ‌ర‌ల‌ను పెంచుతూ వ‌స్తున్నాయి. వ‌రుస‌గా మూడో రోజు కూడా పెట్రో ధ‌ర‌లు పెరిగాయి. గురువారం నాడు లీట‌ర్ పెట్రోల్ పై రూ.25పైస‌లు, డీజిల్ ధ‌ర‌పై రూ.30 పైస‌లు చొప్పున పెంచుతూ చ‌మురు సంస్థ‌లు నిర్ణ‌యం తీసుకున్నాయి. దీంతో దేశ రాజ‌ధాని ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.90.99, డీజిల్‌ రూ.81.42కు చేరింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో నేడు ఇంధ‌న ధ‌ర‌లు ఇలా..

ఢిల్లీలో పెట్రోల్ ధ‌ర రూ.90.99, డీజిల్‌ రూ.81.42.

ముంబైలో పెట్రోల్ రూ.97.34, డీజిల్‌ రూ.88.39.

చెన్నైలో పెట్రోల్‌ రూ.92.90, డీజిల్‌ రూ.86.35.

కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.91.14, డీజిల్‌ రూ.84.26.

బెంగ‌ళూరులో పెట్రోల్‌ రూ.94.01, డీజిల్‌ రూ.86.31.

హైద‌రాబాద్‌లో పెట్రోల్‌ రూ.94.57, డీజిల్‌ రూ.88.77.

జైపూర్‌లో పెట్రోల్‌ రూ.97.03, డీజిల్‌ రూ.89.62.

అంతర్జాతీయ మార్కెటులో ముడి చమురు ధరలు పెరగడంతో మూడో రోజు కూడా పెట్రో ధరలు పెంచామని చమురు సంస్థలు చెబుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో విధించే ప‌న్నుల పై బ‌ట్టి పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల్లో తేడాలు ఉంటాయి. అస‌లే క‌రోనా క‌ష్ట‌కాలంలో.. ఇలా పెట్రోల్ ధ‌ర‌లు పెరుగుతుండ‌డంతో సామాన్యుల జేబుల‌కు చిల్లులు ప‌డుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.


Next Story