భాగ్య‌న‌గ‌రంలో వంద దాటిన డీజిల్ ధ‌ర‌

Petrol and Diesel prices on October 7th.సామాన్యుడిపై పెట్రో భారం కొన‌సాగుతూనే ఉంది. వ‌రుస‌గా మూడో రోజు ఇంధ‌న ధ‌ర‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Oct 2021 3:36 AM GMT
భాగ్య‌న‌గ‌రంలో వంద దాటిన డీజిల్ ధ‌ర‌

సామాన్యుడిపై పెట్రో భారం కొన‌సాగుతూనే ఉంది. వ‌రుస‌గా మూడో రోజు ఇంధ‌న ధ‌ర‌లు పెరిగాయి. గురువారం కూడా లీట‌ర్ పెట్రోల్ పై 32 పైస‌లు, డీజిల్‌పై 38 పైస‌ల చొప్పున పెంచుతూ చ‌మురు కంపెనీలు నిర్ణ‌యం తీసుకున్నాయి. ఇంధ‌న ధ‌ర‌లు పెరుగుతుండ‌డంతో వీటి ప్ర‌భావం నిత్యావ‌స‌రాల‌పై ప‌డుతోంది. దీంతో వాటి ధ‌ర‌లు కూడా కొండెక్కుతున్నాయి. ఇప్ప‌టికే దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ వంద దాట‌గా.. తాజా పెంపుతో డీజిల్ ధ‌ర కూడా శ‌త‌కం దాటింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధ‌ర రూ. 103.24 చేరగా..డీజిల్ ధర రూ. 91.77కి చేరుకుంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఇంధ‌న ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో పెట్రోల్ ధ‌ర రూ.103.24, డీజిల్ ధ‌ర రూ.91.77

- ముంబైలో పెట్రోల్ ధ‌ర రూ.109.25, డీజిల్ ధ‌ర రూ.99.55

- కోల్‌కతాలో పెట్రోల్ ధ‌ర రూ.103.94, డీజిల్ ధ‌ర రూ.94.88

- చెన్నైలో పెట్రోల్ ధ‌ర రూ.109.25, డీజిల్ ధ‌ర రూ.96.37

- బెంగళూరులో పెట్రోల్ ధర రూ.106.83, డీజిల్ ధర రూ.97.40

- భువనేశ్వర్ లీటర్ పెట్రోల్ రూ. 104.57. లీటర్ డీజిల్ రూ. 97.40

- హైదరాబాద్‌లో పెట్రోల్ ధ‌ర‌ రూ.107.40, డీజిల్ ధ‌ర రూ.100.13

- జైపూర్ లీటర్ పెట్రోల్ రూ. 110.24 లీటర్ డీజిల్ రూ. 101.13

- విజయవాడలో పెట్రోల్ ధ‌ర రూ.109.88, డీజిల్ ధర రూ.102.04

Next Story