వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol and Diesel prices on October 6th.పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు
By తోట వంశీ కుమార్ Published on 6 Oct 2021 2:36 AM GMT
పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్నాళ్లు స్థిరంగా ఉన్న ధరలు ఇటీవల మళ్లీ పెరుగుతన్నాయి. దీంతో వాహనాలను భయటకు తీయాలంటే వాహనదారులు జంకుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. బుధవారం లీటరు పెట్రోలుపై 31 పైసలు, లీటరు డీజిల్పై 38 పైసలు చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.102.94, డీజిల్ రూ.91.45కి చేరింది.
ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా..
- ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.102.94, డీజిల్ ధర రూ.91.45,
- ముంబైలో పెట్రోల్ ధర రూ.108.96, డీజిల్ ధర రూ.99.18,
- కోల్కతాలో పెట్రోల్ ధర రూ.103.65, డీజిల్ ధర రూ.94.53
- చెన్నైలో పెట్రోల్ ధర రూ.100.49, డీజిల్ ధర రూ.95.93
- బెంగళూరులో పెట్రోల్ ధర రూ.106.52, డీజిల్ ధర రూ.97.04
- లక్నోలో పెట్రోల్ ధర రూ. 100.13, డీజిల్ ధర రూ.91.71
- హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.107.09, డీజిల్ ధర రూ.99.75.
- విజయవాడలో పెట్రోల్ ధర రూ.109.56, డీజిల్ ధర రూ.101.66