ఆగ‌ని పెట్రో మంట‌.. వ‌రుస‌గా నాలుగో రోజు పెరిగిన ఇంధ‌న ధ‌ర‌లు

Petrol and diesel prices on October 3rd.పెరుగుతున్న ఇంధ‌న ధ‌ర‌లు సామాన్యుడి గుండెల్లో గుబులు రేపుతున్నాయి. వ‌రుస‌గా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Oct 2021 3:51 AM GMT
ఆగ‌ని పెట్రో మంట‌.. వ‌రుస‌గా నాలుగో రోజు పెరిగిన ఇంధ‌న ధ‌ర‌లు

పెరుగుతున్న ఇంధ‌న ధ‌ర‌లు సామాన్యుడి గుండెల్లో గుబులు రేపుతున్నాయి. వ‌రుస‌గా నాలుగో రోజు కూడా ఇంధ‌న ధ‌ర‌ల‌ను పెంచుతూ చ‌మురు కంపెనీలు నిర్ణ‌యం తీసుకున్నాయి. ఆదివారం లీటర్​ పెట్రోల్​ పై 25 పైసలు, డీజిల్​పై 30 పైసలు మేర పెరిగింది. తాజాగా పెంచిన ధ‌ర‌ల‌తో దేశ రాజ‌ధాని ఢిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.102.39కి చేరగా.. డీజిల్​ ధర రూ.90.77కి పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను స‌వ‌రిస్తుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఇంధ‌న ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.102.39, డీజిల్ ధర రూ.90.77

- ముంబైలో పెట్రోల్ ధర రూ.108.43కు, డీజిల్ ధర రూ.98.48

- జైపూర్‌లో పెట్రోల్‌ ధర రూ.109.84, డీజిల్‌ రూ.100.50

- కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.103.07, డీజిల్‌ రూ.93.87,

- చెన్నైలో పెట్రోల్‌ రూ.100.01, డీజిల్‌ రూ.95.31,

- బెంగళూరులో పెట్రోల్‌ రూ.105.95, డీజిల్‌ రూ.96.34

- ల‌క్నోలో పెట్రోల్‌ రూ.99.48, డీజిల్‌ రూ.91.19

-హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.106.51, డీజిల్‌ ధర రూ.99.04

Next Story