ఒక్క‌రోజే ఊర‌ట‌.. మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

Petrol and diesel price on june 11th.సామాన్యుల‌కు ఇంధ‌న ధ‌ర‌లు షాకిస్తున్నాయి. నిన్న ఒక్క రోజు ధ‌ర‌ల పెంపుకు కాస్త

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jun 2021 2:26 AM GMT
ఒక్క‌రోజే ఊర‌ట‌.. మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

సామాన్యుల‌కు ఇంధ‌న ధ‌ర‌లు షాకిస్తున్నాయి. నిన్న ఒక్క రోజు ధ‌ర‌ల పెంపుకు కాస్త విరామం ఇచ్చిన చ‌మురు కంపెనీలు నేడు(శుక్ర‌వారం) పెట్రోల్‌పై లీట‌ర్‌కు 29పైస‌లు, డీజిల్ పై 28 పైస‌లు పెంచాయి. క‌రోనా క‌ష్ట‌కాలంలో ఇంధ‌న ధ‌ర‌లు పెరుగుతుండ‌డంతో సామాన్యుడి బ‌తుకు బండి లాగ‌డం చాలా క‌ష్టంగా మారింది. పెంచిన ధ‌ర‌ల‌తో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.85కు చేరింది. లీటర్ డీజిల్‌ రూ.86.75కు పెరిగింది. కాగా.. ఈ నెల‌లో(జూన్‌)లో నేటితో క‌లిపి ఆరు సార్లు ధ‌ర‌లు పెరుగ‌గా.. మే 4వ తేదీ నుంచి 23 సార్లు చ‌మురు ధ‌ర‌లు పెరిగాయి.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో పెట్రోల్‌ రూ.95.85, డీజిల్‌ రూ.86.75

- ముంబైలో పెట్రోల్‌ రూ.101.04, డీజిల్‌ రూ.94.15

- చెన్నైలో పెట్రోల్‌ రూ.97.19, డీజిల్‌ రూ. 91.42

- కోల్‌కతాలో రూ.95.80, డీజిల్‌ రూ.89.60

- భోపాల్‌ రూ.104.01, డీజిల్‌ రూ.95.35

- రాంచీ పెట్రోల్‌ రూ.92.08, డీజిల్‌ రూ.91.58

- బెంగళూరులో పెట్రోల్‌ రూ.99.05, డీజిల్‌ రూ.91.97

- పాట్నాలో పెట్రోల్‌ రూ.97.95, డీజిల్‌ రూ.92.05

- హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.99.61, డీజిల్‌ రూ.94.56

ఇక దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో ఇప్ప‌టికే లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 మార్క్‌ను దాటింది. డీజిల్‌ సైతం రూ.100 వైపు పరుగులు పెడుతోంది. దేశంలోనే అత్యధికంగా శ్రీగంగానగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.106 మార్క్‌ను దాటగా.. డీజిల్‌ ధర రూ.99 దాటింది.

Next Story