భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌.. ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

June 6th Gold price.కరోనా అనంతరం బంగారం దిగిరావడంతో భారీ ఎత్తున కొనుగోలు పెరిగాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jun 2021 1:31 AM GMT
భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌.. ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

కరోనా అనంతరం బంగారం దిగిరావడంతో భారీ ఎత్తున కొనుగోలు పెరిగాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్న‌(శ‌నివారం) భారీగా త‌గ్గ‌గా.. నేడు(ఆదివారం) మ‌ళ్లీ పెరిగింది. సుమారు రూ.400 పైగాపెరిగింది. పెరిగిన ధ‌ర‌ల ప్ర‌కారం ఏ న‌గ‌రంలో ఎంత ధ‌ర ఉందో ఓ సారి చూద్దాం.

ప్ర‌ధాన‌ న‌గ‌రాల్లో బంగారం ధ‌ర ఇలా..

న్యూఢిల్లీలో 22 క్యారెట్‌ల ధ‌ర‌ రూ. 47,100, 24 క్యారెట్ల ధ‌ర రూ. 51,250

ముంబ‌యిలో 22 క్యారెట్‌ల ధ‌ర‌ రూ. 48,300, 24 క్యారెట్ల ధ‌ర రూ. 49,300

చెన్నైలో 22 క్యారెట్‌ల ధ‌ర రూ. 46,150, 24 క్యారెట్ల ధ‌ర‌ రూ. 50,350

బెంగ‌ళూరులో 22 క్యారెట్‌ల ధ‌ర‌ రూ. 45,900, 24 క్యారెట్ల ధ‌ర రూ.50,070

హైద‌రాబాద్‌లో 22 క్యారెట్‌ల ధ‌ర రూ.45,900, 24 క్యారెట్ల ధ‌ర 50,070

విజ‌య‌వాడ‌లో 22 క్యారెట్‌ల ధ‌ర రూ. 45,900, 24 క్యారెట్ల ధ‌ర‌ రూ. 50,070

విశాఖ‌ప‌ట్నంలో 22 క్యారెట్‌ల ధ‌ర రూ. 45,900, 24 క్యారెట్ల ధ‌ర రూ. 50,070

బంగారం ధరల్లో హెచ్చుత‌గ్గుల‌కు ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు.. బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని అంటున్నారు.

Next Story