ప‌స‌డి ప్రియుల‌కు షాక్‌.. వ‌రుస‌గా మూడో రోజు పెరిగిన బంగారం ధ‌ర‌

July 4th Gold price.బంగారం ధ‌ర‌లు ప‌రుగులు పెడుతున్నాయి. వ‌రుస‌గా మూడో రోజు ప‌సిడి ధ‌ర‌లు పెరిగాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 July 2021 2:29 AM GMT
ప‌స‌డి ప్రియుల‌కు షాక్‌.. వ‌రుస‌గా మూడో రోజు పెరిగిన బంగారం ధ‌ర‌

బంగారం ధ‌ర‌లు ప‌రుగులు పెడుతున్నాయి. వ‌రుస‌గా మూడో రోజు ప‌సిడి ధ‌ర‌లు పెరిగాయి. నేడు బంగారం ధ‌ర స్వల్పంగా పెరిగింది. ఆదివారం 10 గ్రాముల బంగారం ధ‌ర‌పై రూ.100 పెరిగింది. ఇక వెండి ధర విషయానికొస్తే బంగారం బాటలోనే పరుగులు పెడుతోంది. కిలో వెండిపై రూ.700 వరకు పెరిగింది. మరి కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా పెరిగింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330

- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330

ప్ర‌తి రోజు బంగారం ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు చోటు చేసుకోవ‌డానికి అనేక కార‌ణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు..

ఇక దేశీయంగా వెండి ధరలు పెరిగాయి. దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ధరలు హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.69,200 ఉండగా, చెన్నైలో రూ.74,900 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.69,200 ఉండగా, కోల్‌కతాలో రూ.69,200 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.69,200 ఉండగా, కేరళలో రూ.69,200 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,900 ఉండగా, విజయవాడలో రూ.74,900 వద్ద కొనసాగుతోంది.

Next Story