శుభ‌వార్త‌.. వ‌రుస‌గా రెండో రోజు త‌గ్గిన బంగారం ధ‌ర‌

July 19th Gold Price.ప‌సిడిని కొనుగోలు చేయాల‌నుకునే వారికి శుభ‌వార్త‌. వ‌రుస‌గా రెండో రోజు కూడా బంగారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 July 2021 2:08 AM GMT
శుభ‌వార్త‌.. వ‌రుస‌గా రెండో రోజు త‌గ్గిన బంగారం ధ‌ర‌

ప‌సిడిని కొనుగోలు చేయాల‌నుకునే వారికి శుభ‌వార్త‌. వ‌రుస‌గా రెండో రోజు కూడా బంగారం ధ‌ర త‌గ్గింది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో స్వ‌ల్పంగా ప‌సిడి ధ‌ర త‌గ్గ‌గా.. దేశ రాజ‌ధాని ఢిల్లీలో మాత్రం భారీగా పెరిగింది. పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,400, 24 క్యారెట్లు ధర రూ. 51,700

- ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర‌ రూ. 47,190, 24 క్యారెట్ల ధర రూ. 48,190

- చెన్నైలో 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 45,410, 24 క్యారెట్ల ధ‌ర రూ. 49,540

- బెంగళూరులో 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ. 44,900, 24 క్యారెట్ల ధ‌ర రూ.49,000

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.44,990, 24 క్యారెట్ల ధ‌ర రూ.49,000

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 44,990, 24 క్యారెట్ల ధ‌ర రూ. 49,000

- విశాఖలో 22 క్యారెట్ల 10గ్రాముల ధ‌ర‌ రూ. 44,900, 24 క్యారెట్ల ధర రూ.49,000

బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని అంటున్నారు.

Next Story