శుభ‌వార్త‌.. పసిడి ధరలకు బ్రేక్‌

July 11th Gold price.ప్రతి రోజు బంగారం ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 July 2021 2:14 AM GMT
శుభ‌వార్త‌.. పసిడి ధరలకు బ్రేక్‌

ప్రతి రోజు బంగారం ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. గ‌త కొద్ది రోజులుగా బంగారం పెరుగుతోంది. కొనుగోలుదారులకు కాస్త ఊరట కలిగించే వార్త ఏంటంటే.. తాజాగా ఆదివారం ప‌సిడి ధ‌ర‌లు నిలకడగా ఉన్నాయి. గత వారం రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి. అయితే.. బంగారం ధరలకు బ్రేకులు పడితే వెండి ధరలు మాత్రం పరుగులు పెడుతున్నాయి.

ప్రధాన నగరాల్లో బంగారం ధ‌ర‌లు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,370

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,810, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,810

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,050

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820

- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820

బంగారం ధరలు పెర‌గడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు చేర్పులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలుయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు..

ఇక దేశీయంగా వెండి ధరలు పెరిగాయి. తాజాగా వెండిపై రూ.500 మేర పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.69,300 ఉండగా, చెన్నైలో రూ.74,100 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.69,300 ఉండగా, కోల్‌కతాలో రూ.69,300 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.69,300 ఉండగా, కేరళలో రూ.69,300 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,100 ఉండగా, విజయవాడలో రూ.74,100 ఉంది.

Next Story