స్వ‌ల్పంగా పెరిగిన బంగారం.. దిగొచ్చిన వెండి

December 11th Gold price.బంగారం ధ‌ర‌ల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయి. బులియ‌న్ మార్కెట్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Dec 2021 2:04 AM GMT
స్వ‌ల్పంగా పెరిగిన బంగారం.. దిగొచ్చిన వెండి

బంగారం ధ‌ర‌ల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయి. బులియ‌న్ మార్కెట్ ఆధారంగా ఓ రోజు ధ‌ర పెరిగితే.. మ‌రో రోజు త‌గ్గుతూ ఉంటుంది. దీంతో బంగారాన్ని కొనుగోలు చేయాల‌నుకునే వారు వీటి ధ‌ర‌ల‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారిస్తుంటారు. ఇక నేడు ప‌సిడి ధ‌ర స్వ‌ల్పంగా పెరిగింది. 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.10 నుంచి రూ.100 వ‌ర‌కు పెరిగింది. దేశీయంగా ఆయా ప్రాంతాల్లోని ప‌రిస్థితులు, డిమాండ్ ఆధారంగా ప‌సిడి ధ‌ర‌ల పెరుగుద‌ల్లో మార్పులు ఉంటాయి. ఇక వెండి ధ‌ర‌లు దిగి వ‌చ్చాయి.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,110, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,400

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,050

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,110, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,810

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,960 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,030

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,290, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49,560

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,960, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,050

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,960, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,050

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,960, 24 క్యారెట్ల ధర రూ.49,050

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు పరిశీలిస్తే..

ఢిల్లీలో కిలో వెండి ధర.60,700 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.60,700 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.64,800 ఉండగా, కోల్‌కతాలో రూ.60,700 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.60,700 ఉండగా, కేరళలో రూ.65,500 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.64,800 ఉండగా, విజయవాడలో రూ.64,800 వద్ద కొనసాగుతోంది.

Next Story