భారత్లో యూపీఐ ఆధారిత చెల్లింపులు భారీగా పెరిగాయి. చిన్న వస్తువు కొన్నా దానికి ఫోన్ పే, గూగుల్ పే, లేదా ఇతర యూపీఐ యాప్స్ను ఉపయోగించి డబ్బును చెల్లిస్తున్నాము. దీన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అంతరాయం లేకుండా అందించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్లు రోజు మొత్తంలో బ్యాలెన్స్ చెక్ చేసే ప్రక్రియపై కొన్ని పరిమితులను విధించేందుకు సిద్ధమైంది.
కొత్త రూల్స్ ప్రకారం.. రోజులో గరిష్ఠంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయగలరు. ఈ నిబంధన ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి రానుంది. ఒకటి కంటే ఎక్కువ యూపీఐ యాప్లను ఉపయోగించే కస్టమర్లు ఒక్కో యాప్లో రోజుకు 50 సార్లు చొప్పున అంటే.. (ఫోన్పే - 50 సార్లు, గూగుల్ పే - 50 సార్లు) మొత్తం 100 సార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. యూపీఐ నెట్వర్క్పై భారం తగ్గించే ఉద్దేశంతోనే ఈ కొత్త నిబంధనలు తీసుకొస్తున్నట్టు ఎన్పీసీఐ వెల్లడించింది.