స్కూల్ బస్సు రెండేళ్ల బాలుడిని బలిగొంది. మేడ్చల్లోని నవదుర్గ నగర్లో రెండేళ్ల బాలుడిని స్కూల్ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సును డ్రైవర్ రివర్స్ తీసుకునే క్రమంలో వెనుకున్న బాలుడు బస్సు టైర్ల కింద పడిపోవడంతో మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.