మధ్యంతర బడ్జెట్‌లో పన్ను మినహాయింపుల పెంపు!

17వ లోక్‌సభలో చివరిదైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 మధ్య జరుగుతాయి.

By Srikanth Gundamalla  Published on  23 Jan 2024 6:53 AM GMT
central govt, budget 2024, nirmala sitharaman,

మధ్యంతర బడ్జెట్‌లో పన్ను మినహాయింపుల పెంపు!

పార్లమెంట్‌ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈనేపథ్యంలో ఈసారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ కావడంతో చాలా వరకు ప్రజలు కేటాయింపులు, మినహాయింపులపై ఆశలు పెట్టుకున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ 2024ను ప్రవేశపెట్టనున్నారు. పెన్షన్, యాన్యుటీ ప్లాన్‌లలో పన్ను మినహాయింపులు పెంచుతారని పన్నుదారులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ మంది ఆయా ప్లాన్లలో అధికంగా కేటాయింపులు జరిపేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని నిపుణులు విశ్వసిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత వచ్చే ఆదాయానికి పెన్షన్, యాన్యుటీ ప్లాన్‌ల్లో పెడుతున్న పెట్టుబడి చాలా కీలకంగా మారింది.

17వ లోక్‌సభలో చివరిదైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 మధ్య జరుగుతాయి. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ప్రస్తుతం నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌కు సెక్షన్‌ 80సీ కింద ఇస్తున్న రూ.50,000 పన్ను మినహాయింపును పెంచాలని కోరుతున్నారు. దాంతోపాటు పెన్షన్, యాన్యుటీ ప్లాన్‌లకు సైతం ఈ మినహాయింపును వర్తింపజేయాలని నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం ఆ ప్లాన్‌ల్లో మరింత పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతారని భావిస్తున్నారు.

ఈ క్రమంలో ప్రత్యేకించి పన్ను చెల్లింపుదారుల పిరమిడ్ దిగువన ఉన్నవారికి 2024-25 మధ్యంతర బడ్జెట్‌లో ఫిబ్రవరి 1న ప్రకటించబడుతుందని అంచనా. పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించడానికి అధిక మినహాయింపు పరిమితితో పాటు ప్రామాణిక తగ్గింపులో పెంపుదల కొత్త ఆదాయపు పన్ను విధానంలోకి మారే అవకాశం ఉంది. ఈ బడ్జెట్‌లో టీడీఎస్ విషయంలోనూ కొన్ని కీలక ప్రకటనలు ఉంటాయని తెలుస్తోంది. గతంలో 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు కూడా అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ రైతులకు, అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ కవర్‌తో పాటు, స్టాండర్డ్ డిడక్షన్, టీడీఎస్ కోసం థ్రెషోల్డ్‌ను పెంచాలని ప్రతిపాదించారు.

Next Story