ఏప్రిల్ 14న జాతీయ సెలవు దినం.. ఎందుకంటే..?
By Newsmeter.Network Published on 10 April 2020 1:19 PM ISTఇప్పుడు ఎవరి నోట విన్నా ఏప్రిల్ 14వ తేదీ మాటే వినిపిస్తోంది. ఈ తేదీ భారతీయులకు ప్రాముఖ్యమైన తేదీ అయినప్పటికీ ఈసారి మాత్రం ఈ తేదీకి ఉన్న ప్రత్యేకత మరింత పెరిగింది. కారణమేమంటే.. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనానే. దేశంలో కరోనాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను విధించింది. ఈ లాక్డౌన్ 14తో ముగియనుంది. కాగా ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ లాక్డౌన్ గడువును 14 నుంచి మరింత పెంచేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈనెల 14వ తేదీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఫలితంగా ఇప్పుడు ఎవరినోట విన్నా ఏప్రిల్ 14నే వినిపిస్తోంది.
Also Read :రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ..
మరోవైపు మన దేశంలోని ప్రతీఒక్కరికి ఏప్రిల్ 14వ తేదీ సుపరిచితమే.. ఎంతో ప్రత్యేకమైన రోజు. ప్రతీఏటా ఈ తేదీని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాం. దీనికి కారణం.. భారత రాజ్యాంగ సృష్టికర్త బీఆర్ అంబేడ్కర్ జయంతి కావడమే. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం ఈ తేదీని జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. ప్రతీ యేటా అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నాం. అధికారికంగా ప్రధానితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలుసైతం ఈ జయంతి వేడుకల్లో పాల్గొంటారు.అంబేడ్కర్ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటారు.కానీ ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో కేంద్రం లాక్డౌన్ విధించింది. ఎవరూ గుంపులు గుంపులుగా ఉండకూడదనే నిబంధన ఉంది. ఈనేపథ్యంలో కేంద్రం అంబేద్కర్ జయంతి రోజున జాతీయ సెలవు దినంగా ప్రకటించింది.