ఏపీలో కొత్తగా 765 పాజిటివ్‌ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 July 2020 8:39 AM GMT
ఏపీలో కొత్తగా 765 పాజిటివ్‌ కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 24,962సాంపిల్స్‌ని పరీక్షించగా.. కొత్తగా 765 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 727 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 32 మంది..6గురు విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 17699కి చేరింది.

ఈ రోజు కొవిడ్‌ వల్ల కర్నూలులో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరులో ఇద్దరు, కడపలో ఒక్కరు విజయనగరంలో ఒక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 218కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 8008 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 9473మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదు అయిన కేసుల్లో అనంతపురంలో 127, చిత్తూరులో 67, ఈస్ట్‌ గోదావరిలో 102, గుంటూరులో 60, కడపలో 73, కృష్ణలో 70, కర్నూలులో 118, నెల్లూరులో 27, ప్రకాశంలో 57, విశాఖపట్నంలో 9, విజయనగరంలో 13, పశ్చిమ గోదావరిలో 4 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story