ఏపీలో కరోనా ఉగ్రరూపం.. కొత్తగా 605 పాజిటివ్‌ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jun 2020 8:08 AM GMT
ఏపీలో కరోనా ఉగ్రరూపం.. కొత్తగా 605 పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉగ్ర రూపం దాల్చుతోంది. రోజు రోజుకు రికార్డు సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 22,305 సాంపిల్స్‌ని పరీక్షించగా.. కొత్తగా 605 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 570 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 34 మంది.. విదేశాల నుంచి వచ్చినవారు ఒక్కరు ఉన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11489కి చేరింది.

ఈ రోజు కొవిడ్‌ వల్ల కృష్ణలో నలుగురు, కర్నూల్‌లో నలుగురు, గుంటూరులో ఒక్కరు, విశాఖపట్నంలో ఒక్కరు మొత్తం 10మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 146కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 5196 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 6147 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదు అయిన కేసుల్లో అనంతపురంలో 79, చిత్తూరులో 26, ఈస్ట్‌ గోదావరిలో 12, గుంటూరులో 74, కడపలో 133, కృష్ణలో 20, కర్నూలులో 60, నెల్లూరులో 15, ప్రకాశంలో 28, శ్రీకాకుళం 1, విశాఖపట్నంలో 20, విజయనగరంలో 23, పశ్చిమ గోదావరిలో 79 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story