ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 553 పాజిటివ్‌ కేసులు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jun 2020 7:12 AM GMT
ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 553 పాజిటివ్‌ కేసులు..

ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి శరవేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 19,085 సాంపిల్స్‌ని పరీక్షించగా.. కొత్తగా 553 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 477 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 69 మంది.. 7మంది విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10884కి చేరింది.

ఈ రోజు కొవిడ్‌ వల్ల కృష్ణలో ఇద్దరు, కర్నూల్‌లో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒక్కరు మొత్తం 7గురు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 136కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 4988 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 5760 మంది చికిత్స పొందుతున్నారు. ఈరోజు అనంతపురంలో 52, చిత్తూరులో 42, ఈస్ట్‌ గోదావరిలో 64, గుంటూరులో 67, కడపలో 22, కృష్ణలో 47, కర్నూలులో 72, నెల్లూరులో 29, ప్రకాశంలో 18, విశాఖపట్నంలో 40, విజయనగరంలో 5, పశ్చిమ గోదావరిలో 18 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story