ఏపీలో కొత్తగా 477 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jun 2020 7:27 AM GMT
ఏపీలో కొత్తగా 477 కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతి రోజు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 24,471 సాంపిల్స్‌ని పరీక్షించగా.. కొత్తగా 477 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 439 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 34 మంది.. 4 గురు విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8929కి చేరింది.

ఈ రోజు కొవిడ్‌ వల్ల కృష్ణలో ముగ్గురు, కర్నూల్‌లో ఒక్కరు, చిత్తూరులో ఒక్కరు మొత్తం 5గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 106కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 4307 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 4516 మంది చికిత్స పొందుతున్నారు. ఈరోజు అనంతపురంలో 11, చిత్తూరులో 47, ఈస్ట్‌ గోదావరిలో 70, గుంటూరులో 26, కడపలో 58, కృష్ణలో 66, కర్నూలులో 47, నెల్లూరులో 12, ప్రకాశంలో 05, విశాఖపట్నంలో 39, విజయనగరంలో 6, పశ్చిమ గోదావరిలో 52 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Untitled 4 Copy

Next Story