ఏపీలో మరో 141 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jun 2020 8:08 AM GMT
ఏపీలో మరో 141 కేసులు

ఏపీలో క‌రోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గ‌డిచిన 24 గంటల్లో 11,775 సాంపిల్స్ ను ప‌రీక్షించ‌గా.. కొత్త‌గా మ‌రో 141 పాజిటివ్ కేసులు నిర్థార‌ణ అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4402 కి చేరింది. ఈ మ‌హ‌మ్మారి వల్ల ఇప్పటి వరకు 80 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం న‌మోదు అయిన కేసుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 2,599మంది డిశ్చార్జి కాగా.. 1723మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Untitled 4 CopyAP corona cases rise to 4402

Next Story