ఏపీలో ఒకేరోజు కొత్తగా 66 కరోనా కేసులు

By సుభాష్  Published on  24 May 2020 8:28 AM GMT
ఏపీలో ఒకేరోజు కొత్తగా 66 కరోనా కేసులు

ఏపీలో కరోనా వైరస్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నా.. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాగాజా గడిచిన 24 గంటల్లో కొత్తగా 66 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. 11,357 మందికి పరీక్షలు నిర్వహించగా, 66 మందికి కరోనా తేలింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 2627 కరోనా కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకూ 1807 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకూ 56 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం 764 మంది కోవిడ్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఏపీలో కరోనాను అరికట్టేందుకు అన్ని విధాలుగా చర్యలు చేపట్టినా.. కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మొదట్లో కేసుల సంఖ్య తక్కువగా నమోదు కాగా, ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రార్థనల నేపథ్యంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతూ వస్తోంది.

Next Story