ఎంపీ అవినాష్ రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు
YS Viveka Murder Case MP Avinash Reddy gets once again cbi notice.ఎంపీ అవినాష్ రెడ్డికి బుధవారం సీబీఐ మరోసారి నోటీసులు
By తోట వంశీ కుమార్ Published on
25 Jan 2023 8:00 AM GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి బుధవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) మరోసారి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో ఈ నెల 28న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది.
కాగా.. వైఎస్ అవినాష్ రెడ్డికి ఈ నెల 23న సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 24న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. అయితే.. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల తాను విచారణకు హాజరుకాలేనని, నాలుగు రోజుల సమయం కావాలని అవినాష్ రెడ్డి.. సీబీఐ అధికారులను కోరారు. ఈ నేపథ్యంలో సీబీఐ ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని రెండోసారి నోటీసులు జారీ చేసింది.
Next Story