వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తల కోసం.. వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయం

వేధింపులకు గురవుతున్న సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు యాప్‌ను రూపొందించాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ వైసీపీ సోషల్‌ మీడియా విభాగాన్ని కోరారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 April 2024 2:21 PM GMT
YS Jagan,  YCP, YCP social media activists, APPolls

వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తల కోసం.. వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయం

విశాఖపట్నం: తమ పోస్టుల కారణంగా వేధింపులకు గురవుతున్న సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు యాప్‌ను రూపొందించాలని వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా విభాగాన్ని కోరారు.

మంగళవారం విశాఖపట్నంలో మేమంతా సిద్దం యాత్రలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో జగన్ ఇంటరాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా కార్యకర్తల సమస్యలపై ప్రతి వారం నివేదిక ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా, సోషల్ మీడియా కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్‌ను జగన్ కోరారు.

ట్రోల్‌లు ఇన్‌ఫ్లుయెన్సర్‌ను ఉద్యోగం మానేయడానికి పురికొల్పాయి

ఇవాళ జగన్‌ను కలవడానికి వందలాది మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ విశాఖలో గుమిగూడారు. సోషల్ మీడియాలో ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నుండి వారు ఎదుర్కొంటున్న ట్రోల్స్ సమస్యలను పంచుకున్నారు.

ప్రభుత్వ పథకాలు అందాయని సంతోషం వ్యక్తం చేసిన గీతాంజలిని సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు తీవ్రంగా ట్రోల్ చేయడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయాన్ని జగన్ గుర్తు చేసుకున్నారు. ఈ సమావేశానికి గీతాంజలి భర్త కూడా హాజరయ్యారు.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సుచరిత జగన్‌తో మాట్లాడుతూ, తాను ఎదుర్కొన్న వేధింపులను పంచుకుంది. ''నేను విశాఖ ఎయిర్‌పోర్ట్ ఫుడ్ కోర్ట్‌లో ప్రైవేట్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నప్పుడు కోడికత్తి శ్రీను మీ (జగన్)పై దాడి చేశాడు. నా చుట్టూ ఉన్నవారంతా టీడీపీ సానుభూతిపరులే, నేను జగన్ అభిమానిని అని తెలుసుకున్న తర్వాత అందరూ నన్ను ఉద్యోగ సమయంలోనూ, సోషల్ మీడియాలోనూ వేధించారు. నేను PCS నియమాన్ని అనుసరించడానికి ప్రయత్నించినప్పుడు, వారు నన్ను మరింత వేధించారు, ఇది నా రాజీనామాకు దారితీసింది'' అని చెప్పారు.

తనపై తప్పుడు దొంగతనం కేసు పెట్టారని, దీంతో తనకు వేరే ఉద్యోగం రాకుండా చేశారని, అప్పటి నుంచి ఉద్యోగం లేకుండా పోతున్నానని ఆమె పేర్కొంది. "నా కుటుంబం కూడా వేధించబడింది. మేము నగరం నుండి దూరంగా వెళ్ళాము," ఆమె తెలిపింది.

గీతాంజలి గుర్తొచ్చింది

జగనన్న గృహ నిర్మాణ పథకం లబ్ధిదారురాలిగా గుర్తింపు పొందిన తర్వాత గీతాంజలి వెలుగులోకి వచ్చింది. ఒక ప్రజా కార్యక్రమంలో ఆమెకు పథకం కింద ఉచితంగా ప్లాట్లు ఇవ్వబడ్డాయి. దీనిపై హర్షం వ్యక్తం చేసిన గీతాంజలి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కెమెరాలో కొనియాడారు.

దీని తరువాత, ఆమె చాలా పేజీల నుండి సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్, అవమానకరమైప వ్యాఖ్యలకు గురైంది. మార్చి 7న ఉదయం 11 గంటల సమయంలో గీతాంజలి ఎదురుగా వస్తున్న రైలు ముందు నిలబడి ఆత్మహత్యాయత్నం చేసింది. రైలు లోకో పైలట్ రైలును ఆపడానికి ప్రయత్నించగా, ఆమె తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె మార్చి 11న ఆసుపత్రిలో మరణించింది.

Next Story