వంశీకి వైఎస్‌ జగన్‌ పరామర్శ.. రాత్రి సంచలన నిజం బయటపెడతామంటూ వైసీపీ ట్వీట్‌

విజయవాడ జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. జగన్‌తో పాటు వంశీ భార్య పంకజశ్రీ కూడా లోపలికి వెళ్లారు.

By అంజి  Published on  18 Feb 2025 12:19 PM IST
YS Jagan, Vallabhaneni Vamsi, jail,  YCP, APnews

వంశీకి వైఎస్‌ జగన్‌ పరామర్శ.. రాత్రి సంచలన నిజం బయటపెడతామంటూ వైసీపీ ట్వీట్‌

విజయవాడ జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. జగన్‌తో పాటు వంశీ భార్య పంకజశ్రీ కూడా లోపలికి వెళ్లారు. ఈ క్రమంలోనే వంశీ ఆరోగ్య పరిస్థితిని జగన్‌ అడిగి తెలుసుకున్నారు. పార్టీ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. వైఎస్‌ జగన్‌ రావడంతో జైలు వద్దకు వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే జైలు పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

అటు వల్లభనేని వంశీపై నమోదైన కేసు గురించి సంచలన విషయం వెల్లడించబోతున్నట్టు వైసీపీ ట్వీట్‌ చేసింది. 'ఇవాళ రాత్రి 7 గంటలకు గన్నవరం కేసుకు సంబంధించిన నిజాన్ని బయటపెట్టబోతున్నాం. అతి పెద్ద రహస్యం బయటపడనుంది' అని పేర్కొంది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు ఫిర్యాదుదారైన సత్యవర్ధన్‌ను బెదిరించారని ఆరోపిస్తూ పోలీసులు వంశీని జైలుకు పంపిన విషయం తెలిసిందే.

Next Story