అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అక్కంపల్లి గ్రామానికి చెందిన సురేష్ బాబు అనే వ్యక్తిని తన భార్య ప్రియుడితో దారుణంగా చంపించింది. వివాహేతర సంబంధినికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించింది. తలపై బలంగా బాది సురేష్ బాబును కిరాతకంగా చంపాడు ఆమె ప్రియుడు. హత్య వెలుగులోకి వచ్చిన గంటల వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించారు. భార్య అనిత, ఆమె ప్రియుడు ఫక్రుద్దీన్ ని అరెస్ట్ చేశారు.
సురేష్ బాబు తన గ్రామ సమీపంలోని కల్యాణదుర్గం రోడ్డులో ఓ చిన్న హోటల్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతడి భార్య అనితకు ఫక్రుద్దీన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఫక్రుద్దీన్ స్థానిక సదాశివకాలనీలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అనిత, ఫక్రుద్దీన్ మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. భర్త సురేష్ బాబుకు ఆమెపై పై అనుమానం వచ్చింది. భర్త వేధింపుల గురించి ప్రియుడితో చెప్పుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త సురేష్ ని చంపాలని ప్లాన్ వేశారు.
రాత్రి హోటల్ మూసి ఇంటికి వస్తున్న భర్త సురేష్ పై ఫక్రుద్దీన్దాడి చేశాడు. తలపై బలంగా కొట్టడం వల్లే సురేష్ చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ హత్య జరిగిన కేవలం ఆరు గంటల్లోనే కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేశారు.