నకిలీ మద్యం కేసులో మధ్యంతర బెయిల్ కోసం నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్పై విచారణను విజయవాడ ఎక్సైజ్ కోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను నవంబర్ 11వ తేదీన చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న జనార్ధన రావు, జగన్మోహన రావు, ప్రదీప్, రవి, శ్రీనివాస రెడ్డి, కళ్యాణ్, శ్రీనివాస రావు, సతీశ్ కుమార్తో పాటు మరొకరు తమకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తి, ఇరు పక్షాల వాదనలను విన్నారు. నిందితుల బెయిల్ పిటిషన్లపై వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని భవానీపురం ఎక్సైజ్ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం నిందితులంతా నెల్లూరు కేంద్ర కారాగారంతో పాటు విజయవాడ జిల్లా జైలులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు.