ఈ నెలాఖరుకల్లా సచివాలయాల ఉద్యోగుల బదిలీలు

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలను ఈ నెల ఆఖరుకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.

By అంజి
Published on : 13 Jun 2025 8:02 AM IST

Transfers, employees, village, ward secretariats , APnews

ఈ నెలాఖరుకల్లా సచివాలయాల ఉద్యోగుల బదిలీలు

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలను ఈ నెల ఆఖరుకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. 2025 మే 31 నాటికి ఐదేళ్లు ఒకే చోట పని చేసిన వారికి తప్పనిసరిగా స్థానచలనం ఉంటుందని, సొంత మండలాల్లో పోస్టింగ్‌ ఉండదని స్పష్టం చేసింది. భార్యభర్తలు ఉద్యోగులైతే ఒకేచోట దగ్గర్లోని సచివాలయంలో అవకాశం కల్పిస్తామంది. విధుల రేషనలైజేషన్‌ తర్వాత మిగిలిన ఉద్యోగులను డిప్యుటేషన్‌పై ఇతర శాఖలకు పంపనుంది.

ఈ మేరకు విధుల హేతుబద్ధీకరణ, బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేస్తూ బదిలీ మార్గదర్శకాలతో కూడి ఉత్తర్వులను గ్రామ, వార్డు సచివాలయ శాఖ కార్యదర్శి కె.భాస్కర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐదేళ్లు పూర్తి కానీ ఉద్యోగులన కూడా వారి అభ్యర్థన చేస్తే బదిలీ చేయాలని చెప్పారు. దృష్టిలోపం ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అలాగే మానసిక వికలాంగ పిల్లలు ఉన్న ఉద్యోగులను వారు కోరుకున్న ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్‌ చేయాలి. గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకుపైగా పని చేసిన ఉద్యోగులకు, 40 శాతం వైకల్యం ఉన్న ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత ఉంటుంది.

Next Story