Guntur: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు దుర్మరణం

గుంటూరు జిల్లా నీరుకొండ గ్రామం సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో రిక్షా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.

By అంజి  Published on  17 Feb 2025 10:33 AM IST
Three women died, fatal road accident, Guntur district, APnews

Guntur: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు దుర్మరణం

గుంటూరు జిల్లా నీరుకొండ గ్రామం సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో రిక్షా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దినసరి కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. మృతులందరూ మహిళలేనని, మిరప పొలంలో పని చేయడానికి వ్యవసాయ పొలానికి వెళ్తున్నారని నివేదికలు తెలిపాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారి పరిస్థితి మెరుగుపడుతోంది.

మహిళా కార్మికులు చేబ్రోలు మండలంలోని షుడపల్లి గ్రామానికి చెందినవారు. మరణించిన మహిళలు సీతారావమ్మ, నాంచారమ్మ, అరుణగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారని పొన్నూరు గ్రామీణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావును ఉటంకిస్తూ ఏఎన్‌ఐ తెలిపింది.

ఈ ప్రమాద ఘటనపై మంత్రి దుర్గేష్‌ ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు, జీజీహెచ్ వైద్యులకు మంత్రి దుర్గేష్ ఆదేశాలిచ్చారు. ప్రమాదంలో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారన్న వార్త కలిచి వేసిందని మంత్రి అన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి దుర్గేష్‌ వెల్లడించారు.

Next Story