అమెరికాలో కాల్పులు.. ఏపీ యువకుడు మృతి

Telugu youngster shot dead in robbery in US. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. అలబామాలో తాను పనిచేస్తున్న దుకాణంలో గురువారం జరిగిన దోపిడీలో ఓ

By అంజి
Published on : 13 Feb 2022 10:05 AM IST

అమెరికాలో కాల్పులు.. ఏపీ యువకుడు మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. అలబామాలో తాను పనిచేస్తున్న దుకాణంలో గురువారం జరిగిన దోపిడీలో ఓ తెలుగు యువకుడు కాల్చి చంపబడ్డాడు. నెల రోజుల క్రితమే అమెరికా చేరుకున్న 27 ఏళ్ల తెలుగు విద్యార్థి.. ఓ స్టోర్‌లో పార్ట్‌టైమ్ జాబ్‌ చేస్తున్నాడు. రిపోర్ట్‌ ప్రకారం.. గురువారం ఉదయం 9.30 గంటలకు (యుఎస్ కాలమానం ప్రకారం) ఈ సంఘటన జరిగింది. తల్లాడేగా కౌంటీ షెరీఫ్ కార్యాలయం బాధితుడిని శ్రీ సత్య కృష్ణ చిట్టూరిగా గుర్తించడంతో పాటు, అనుమానిత దుండగుడు చిత్రాలను విడుదల చేసింది. ఓల్డ్ బర్మింగ్‌హామ్ హైవేలోని క్రౌన్ సర్వీస్ స్టేషన్‌లో జరిగిన దోపిడీకి సంబంధించిన రిపోర్టుపై పోలీసులు ఉదయం 9.45 గంటలకు స్పందించారని నివేదికలు తెలిపాయి.

వారు వచ్చి చూసే సరికి స్టోర్ గుమస్తాగా పనిచేస్తున్న సత్యకృష్ణ దుకాణం లోపల స్పందించకుండా కనిపించాడు. అనుమానితుడు దుకాణం నుండి నిర్ణయించబడని నగదును కూడా తీసుకున్నాడని, అతని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. సత్య కృష్ణ కోసం విరాళాలు కోరుతూ gofundme.comలో చేసిన పోస్ట్ ప్రకారం, అతను వివాహం చేసుకున్నాడు. అతని భార్య గర్భవతి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ జంట త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతోందని, ఆయన నెల రోజుల క్రితమే అమెరికా వెళ్లారు. శోభన్ మట్టా పెట్టిన పోస్ట్, కష్ట సమయంలో కుటుంబానికి విరాళాలు ఇవ్వాలని, మృతదేహాన్ని భారతదేశానికి పంపాలని కోరింది. సత్యకృష్ణ మృతితో అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story