బయటకు వచ్చిన వేముల దుర్గారావు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై రాళ్ల దాడి కేసులో అనుమానితుడైన టీడీపీ నేత వేముల దుర్గారావును పోలీసులు విడుదల చేశారు.

By M.S.R  Published on  22 April 2024 5:30 AM GMT
బయటకు వచ్చిన వేముల దుర్గారావు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై రాళ్ల దాడి కేసులో అనుమానితుడైన టీడీపీ నేత వేముల దుర్గారావును పోలీసులు విడుదల చేశారు. నాలుగు రోజులకు పైగా కస్టడీలో ఉన్న అతడిని పోలీసులు శనివారం రాత్రి విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమీషనర్ కార్యాలయం వెలుపల అతని కుటుంబ సభ్యులు, పలు సంఘాల నాయకులు అతన్ని చూపించాలని డిమాండ్ చేసిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. దుర్గారావు తరపున సోమవారం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవ్వగా.. అది జరగకముందే దుర్గా రావు విడుదలయ్యారు. ఏప్రిల్ 13న సీఎం జగన్‌పై రాయి విసిరిన ఘటనలో దుర్గా రావును అదుపులోకి తీసుకున్నారు.

అతని అరెస్టు తరువాత, దుర్గారావు ఆచూకీ తెలియలేదు. అతని న్యాయవాది సలీం హెబియస్ కార్పస్ పిటిషన్‌కు సిద్ధమయ్యారు. దుర్గారావు కుటుంబీకులు, వడ్డెర కాలనీ వాసులు తన భర్తను చూడాలని దుర్గా రావు భార్య శాంతి కోరింది. 160 సిఆర్‌పిసి కింద నోటీసు జారీ చేసి, భవిష్యత్ విచారణల కోసం సంతకాలు తీసుకున్న పోలీసులు విజయవాడ నార్త్ ఎసిపి కార్యాలయంలో దుర్గారావును విడుదల చేశారు.

Next Story