ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్..వారికి కాఫీ ఇచ్చిన సీఎం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో అరుకు కాఫీ స్టాల్‌ను ప్రారంభించారు.

By Knakam Karthik
Published on : 18 March 2025 3:19 PM IST

Andrapradesh, Ap Assembly Premises, Araku Coffee Stall, Speaker Ayyanna Patrudu

ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్..వారికి కాఫీ ఇచ్చిన సీఎం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో అరుకు కాఫీ స్టాల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రిబ్బన్ కట్ చేసిన అరుకు కాఫీ స్టాల్‌ను ప్రారంభించారు.

అరకు ప్రాంతం నుంచి సేంద్రీయ విధానంలో ఉత్పత్తి చేసిన ఈ కాఫీ ప్రత్యేకమైన రుచిని కలిగి ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, ఇలాంటి ఉత్పత్తులను ప్రభుత్వ పరంగా మరింత ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణం రాజు, గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కి అరకు కాఫీని స్వయంగా అందజేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరకు కాఫీకి ప్రచారం కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చొరవకు అనుగుణంగా, తెలుగుదేశం పార్టీ (TDP) పార్లమెంటు సభ్యులు గతంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను పార్లమెంటు ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను అనుసరించి, పార్లమెంటు ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు స్పీకర్ ఆమోదం తెలిపారు. లోక్‌సభ డిప్యూటీ సెక్రటరీ అజిత్ కుమార్ సాహూ అవసరమైన ఉత్తర్వులు జారీ చేశారు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుకు అధికారిక లేఖ ద్వారా తెలియజేశారు.

Next Story