ఆ రూట్లో 48 స్పెషల్ ట్రైన్స్..గుడ్న్యూస్ చెప్పిన రైల్వేశాఖ
ప్యాసింజర్లకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది.
By Knakam Karthik
ఆ రూట్లో 48 స్పెషల్ ట్రైన్స్..గుడ్న్యూస్ చెప్పిన రైల్వేశాఖ
ప్యాసింజర్లకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు పలు ముఖ్యమైన మార్గాల్లో మొత్తం 48 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. జులై 9 నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.
తిరుపతి-హిసార్ మధ్య 12 సర్వీసులను నడపనున్నారు. ఈ రైళ్లు ప్రతి బుధ, ఆదివారాల్లో అందుబాటులో ఉంటాయి. అదే విధంగా, కాచిగూడ-తిరుపతి మధ్య 8 రైళ్లు ప్రతి గురు, శుక్రవారాల్లో రాకపోకలు సాగిస్తాయి. ఇక నరసాపూర్-తిరువణ్ణామలై మార్గంలో అత్యధికంగా 16 ప్రత్యేక రైళ్లను బుధ, గురువారాల్లో నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైళ్ల రాకపోకల సమయాలు, ఇతర పూర్తి వివరాల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని కోరారు.