ఏపీలో ఇసుక తవ్వకాల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక తవ్వకాల కేసుకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది.

By -  Knakam Karthik
Published on : 29 Oct 2025 11:14 AM IST

Andrapradesh, Supreme Court, Sand mining case, Andrapradesh Government

ఏపీలో ఇసుక తవ్వకాల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక తవ్వకాల కేసుకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. బుధవారం విచారణ సందర్భంగా న్యాయమూర్తులు కేసు పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదుల నుండి వివరాలు అడిగారు. వివరాల ప్రకారం, గత సెప్టెంబర్ 24న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, హైకోర్టు ఇసుక తవ్వకాలపై పెండింగ్‌లో ఉన్న కొన్ని అప్పీల్ కేసుల్లో తీర్పును రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు ఆ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సూచించగా, హైకోర్టు ఆ కేసులను నవంబర్ 3న విచారణకు లిస్టు చేసింది.

న్యాయవాదులు కోర్టుకు వివరిస్తూ, “ఇసుక తవ్వకాల స్థాయి, పరిమాణంపై ప్రభుత్వ అంచనా మరియు ప్రజాప్రయోజన వ్యాజ్య పిటిషనర్ అంచనాల మధ్య కొంత వ్యత్యాసం ఉంది. ఎందుకంటే నది పాదంలోని ఇసుక ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితమైన నివేదిక సిద్ధం చేయడానికి సమయం కావాలి” అని తెలిపారు.దీనిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు బెంచ్, కేసు తదుపరి విచారణను నవంబర్ 19కు వాయిదా వేసింది. న్యాయమూర్తులు “తదుపరి నాలుగు వారాల తర్వాత కేసు మళ్లీ విచారణకు తీసుకురండి” అని సూచించారు. కాగా ఈ కేసు ఆంధ్రప్రదేశ్‌లోని ఇసుక తవ్వకాల అనుమతులు, పర్యావరణ నిబంధనలు ఉల్లంఘనలపై కొనసాగుతున్న ప్రజాప్రయోజన వ్యాజ్యానికి సంబంధించినది.

Next Story