Andhrapradesh: లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు.. 20 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కదిరి నుంచి బయల్దేరిన పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు వైఎస్సార్‌ జిల్లా పులివెందుల సమీపంలో 30 అడుగుల లోయలో పడింది.

By అంజి
Published on : 23 Oct 2024 10:43 AM IST

Andhrapradesh, RTC bus, valley , YSR district, 20 people injured

Andhrapradesh: లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు.. 20 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కదిరి నుంచి బయల్దేరిన పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు వైఎస్సార్‌ జిల్లా పులివెందుల సమీపంలో 30 అడుగుల లోయలో పడింది. బస్సు అదుపు తప్పడంతో ఈ ఘటన జరిగింది. దీంతో బస్సులో ఉన్న వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో 20 మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది.

క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గురువారం తెల్లవారుజామున పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు కదిరి నుంచి పులివెందులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే క్రమంలో 30 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story