రాష్ట్రంలో పెట్టుబడులకు కొత్త పాలసీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం

బెస్ట్ పారిశ్రామిక పాలసీలతో ఎపి ఇప్పుడు పెట్టుబడులకు సిద్దంగా ఉందంటూ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.

By Kalasani Durgapraveen  Published on  17 Oct 2024 9:36 AM GMT
రాష్ట్రంలో పెట్టుబడులకు కొత్త పాలసీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం

బెస్ట్ పారిశ్రామిక పాలసీలతో ఎపి ఇప్పుడు పెట్టుబడులకు సిద్దంగా ఉందంటూ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ఎపిలో కార్యకలాపాలకు పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. సమర్థులైన యువత, స్నేహ పూర్వక ప్రభుత్వం, మౌళిక సదుపాయాలతో పెట్టుబడులకు ఎపి స్వర్గధామం అని పేర్కొన్నారు.పెట్టబడులతో మీ వ్యాపారం పెరుగుతుంది.. మా రాష్ట్రం వృద్ధి చెందుతుందన్నారు. కొత్త పాలసీలు వేగవంతమైన వ్యాపార నిర్వహణకు దోహదం చేస్తాయి అన్నారు. మేము దేశంలో అత్యుత్తమ వ్యాపార వాతారణ వ్యవస్థను నిర్మిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో మీ వ్యాపారానికి ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని.. నేను వ్యక్తిగతంగా మీకు హామీ ఇస్తున్నా.. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇంతకంటే మంచి సమయం ఎప్పుడూ లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టడానికి కూడా ఇంతకంటే మంచి సమయం ఎప్పుడూ రాదు.. రాష్ట్రంలో పెట్టుబడులతో మీ వ్యాపారం పెరుగుతుంది.. రాష్ట్ర సామర్థ్యం పెరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మీ పెట్టుబడుల కోసం మేం ఎదురుచూస్తున్నాం అని ఆశాబావం వ్యక్తం చేశారు.

Next Story