అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలో కూడా ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈరోజు రాజ్యసభలో చర్చ అనంతరం ఆమోదం తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఈ బిల్లుపై చర్చను ప్రారంభించారు. బిల్లుపై చర్చ సమయంలో వైసీపీ ఎంపీలు వాకౌట్ చేశారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన అనంతరం రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.