మాజీ సీఎం జగన్‌పై క్రిమినల్‌ కేసు.. రఘు రామకృష్ణంరాజు ఫిర్యాదు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదైంది. ఈ కేసు టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కస్టడీలో ఉన్న సమయంలో చిత్రహింసలకు సంబంధించినది.

By అంజి  Published on  12 July 2024 8:30 AM GMT
Raghu Rama Krishna Raju, Ex CM Jagan, APnews

మాజీ సీఎం జగన్‌పై క్రిమినల్‌ కేసు.. రఘు రామకృష్ణంరాజు ఫిర్యాదు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదైంది. ఈ కేసు టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కస్టడీలో ఉన్న సమయంలో చిత్రహింసలకు సంబంధించినది. గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు మేరకు 120బి, 166, 167, 197, 307, 326, 465, 508 (34) సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు.

కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం జరిగిందని కృష్ణంరాజు ఆరోపణలు చేశారు. ఈ కేసులో జగన్‌ ఏ-3గా ఉన్నాఉ. సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ ఏ-1, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు ఏ- 2, విజయపాల్ ఏ- 4, డాక్టర్ ప్రభావతి ఏ-5 గా ఉన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పలు ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఈ సంఘటన మే 14, 2021న జరిగింది.

కృష్ణంరాజు నిన్న ఫిర్యాదును దాఖలు చేస్తూ.. వైఎస్‌ జగన్ ఒత్తిడితోనే తనను అక్రమంగా అరెస్టు చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను బైపాస్ సర్జరీ చేయించుకున్నానని చెప్పినప్పటికీ, తనను కస్టడీలో హింసించారని చెప్పారు. తనని చంపే ప్రయత్నంలో తన ఛాతీపై కూర్చున్నట్లు కృష్ణంరాజు ఆరోపించారు.

ఫోన్‌ పాస్‌వర్డ్‌ చెప్పనందుకు తనను కొట్టారని రాజు పేర్కొన్నాడు. జీజీహెచ్‌ డాక్టర్ ప్రభావతిపై కూడా కృష్ణంరాజు ఫిర్యాదు చేశాడు, ఆమె పోలీసుల ఒత్తిడితో తప్పుడు వైద్య నివేదికలను అందించిందని ఆరోపించింది. జగన్‌ను విమర్శించినందుకు తనను చంపుతానని సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ బెదిరించారని రాజు ప్రస్తావించారు.

Next Story