అంబటి రాంబాబుపై కేసు నమోదు.. అందుకే!!

మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై గుంటూరు పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

By అంజి
Published on : 5 Jun 2025 11:03 AM IST

Police case registered, former minister Ambati Rambabu, APnews

అంబటి రాంబాబుపై కేసు నమోదు.. అందుకే!! 

మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై గుంటూరు పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వైఎస్సార్‌సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా అంబటి రాంబాబు సిద్ధార్థ్‌నగర్‌లోని తన నివాసం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీగా కలెక్టరేట్‌కు బయల్దేరగా పోలీసులు అడ్డుకున్నారు.

ర్యాలీ స్థంబాలగరువు, పట్టాభిపురం మీదుగా మూసేసిన జూట్‌ మిల్లు వద్దనున్న సబ్‌ స్టేషన్‌కు చేరుకోగా పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ, సిబ్బంది అడ్డుకునే యత్నం చేశారు. ఆ సమయంలో వాగ్వాదం జరిగింది. పోలీసు విధులకు ఆటంకం కలిగించారని, అనుమతి లేకుండా ర్యాలీ తీశారంటూ పలు సెక్షన్లతో అంబటిపై కేసు నమోదు చేశారు.

Next Story