24 గంటల్లో రెండు గిన్నిస్ రికార్డులు..ఏపీలో చరిత్ర సృష్టించిన NHAI ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్ మరోసారి దేశానికి గర్వకారణంగా నిలిచింది
By - Knakam Karthik |
24 గంటల్లో రెండు గిన్నిస్ రికార్డులు..ఏపీలో చరిత్ర సృష్టించిన NHAI ప్రాజెక్ట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మరోసారి దేశానికి గర్వకారణంగా నిలిచింది. బెంగళూరు–కడప–విజయవాడ ఆర్థిక కారిడార్ (NH-544G)పై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఆధ్వర్యంలో చేపట్టిన రహదారి నిర్మాణ పనులు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించాయి.
ఎన్హెచ్ఏఐ తరఫున ఎం/ఎస్ రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ఘనతను సొంతం చేసుకుంది. కేవలం 24 గంటల వ్యవధిలో 28.95 లేన్-కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేయడంతో పాటు, 10,675 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్ను నిరంతరంగా వేయడం ద్వారా ఈ అరుదైన ప్రపంచ రికార్డులు నమోదు అయ్యాయి.
ఈ అసాధారణ విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు , ఇది భారత ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమని సీఎం పేర్కొన్నారు. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ప్రపంచస్థాయి హైవే మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతున్నాయని సిఎం చంద్రబాబు అన్నారు. అలాగే ఈ విజయానికి కారణమైన ఇంజినీర్లు, కార్మికులు, ఫీల్డ్ సిబ్బంది అంకితభావం ప్రశంసనీయమని, కఠినమైన NHAI నాణ్యత ప్రమాణాలను పూర్తిగా పాటిస్తూ పనులు చేపట్టడం అభినందనీయమని అన్నారు.
Proud moment for India 🇮🇳 | Andhra PradeshToday, NHAI, through M/s Rajpath Infracon Pvt. Ltd., achieved two Guinness World Records in Andhra Pradesh on the Bengaluru–Kadapa–Vijayawada Economic Corridor (NH-544G) by laying 28.95 lane-kilometres and 10,675 MT of Bituminous… pic.twitter.com/d7oyJnkfPH
— N Chandrababu Naidu (@ncbn) January 7, 2026