చేనేత కార్మికుల‌కు శుభ‌వార్త‌.. ఒక్కొక్క‌రి అకౌంట్‌లో రూ.24వేలు

Nethanna Nestham scheme third installment on august 10th.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికుల‌కు ప్ర‌భుత్వం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Aug 2021 7:28 AM GMT
చేనేత కార్మికుల‌కు శుభ‌వార్త‌.. ఒక్కొక్క‌రి అకౌంట్‌లో రూ.24వేలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ.. చేనేత‌ల‌కు ఆర్థిక భ‌రోసా క‌ల్పించే నేత‌న్న నేస్తం మూడో విడత సాయాన్ని అందించేందుకు సిద్ద‌మైంది. ఇప్పటికే రెండు పర్యాయాలు నేతన్న నేస్తం అందించిన ప్రభుత్వం మూడో పర్యాయం కూడా ఒక్కొక్కరికీ రూ. 24 వేల చొప్పున సాయమందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 10న సొంత మ‌గ్గం ఉన్న కార్మికుల బ్యాంకు ఖాతాల్లో డ‌బ్బు జ‌మ కానుంది. పథకాన్ని లబ్ధిదారులకు చేరువ చేసేందుకు శనివారం నుంచి మూడు రోజులపాటు ప్రచారాన్ని నిర్వహించాలని గ్రామ, వార్డు వాలంటీర్లు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కార్మికులు స్థానికంగా చేనేత సంఘంలో రిజిస్టర్‌ అయి ఉన్నారా, లేదా అనే విషయాన్ని పరిశీలించాలని స్పష్టం చేసింది. సొంతంగా మగ్గాలున్న ప్రతీ కుటుంబానికి వైఎస్ఆర్ చేనేత నేస్తం పథకం అందుతుంది. కుటుంబానికి ఎన్ని మగ్గాలున్నా ఒక యూనిట్ గానే పరిగణిస్తారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి, మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబం ఈ పథకానికి అర్హులు. ఈ పథకంతో నేతన్నల మగ్గం ఆధునీకరణ, నూలు కొనుగోలుకు తోడ్పాటును అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Next Story