ప్ర‌ధాని మోదీకి చంద్ర‌బాబు లేఖ‌

Nara Chandrababu wrote a letter to PM Modi.ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Oct 2021 11:21 AM GMT
ప్ర‌ధాని మోదీకి చంద్ర‌బాబు లేఖ‌

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు లేఖ రాశారు. బీసీ జనగణన చేపట్టాలని ఆ లేఖ‌లో ప్ర‌ధానికి చంద్ర‌బాబు విజ్ఞ‌ప్తి చేశారు. బీసీల‌కు సంబంధించిన స‌రైన స‌మాచారం లేక‌పోవ‌డంతో ఆ వ‌ర్గాల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌న్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసినా బీసీలు ఇంకా వెనుకబడే ఉన్నారన్నారు. . బీసీ జన గణన పక్కాగా జరిగి తేనే బీసీలకు సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన లేఖలో చంద్ర‌బాబు తెలిపారు. కులాల వారీగా అందుబాటు లో ఉన్న జనగణన వివరాలు 90 ఏళ్ల ఏళ్ల‌నాటివన్నారు. అవి ఇప్పుడు ప‌నికి రావ‌న్నారు. బీసీ జనగణన కోసం టీడీపీ హయాంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. దీనిపై ప్రధాని స్పందించాలని చంద్ర‌బాబు ఆ లేఖ‌లో కోరారు.

Next Story