చంద్రబాబుకు రెస్ట్ ఇద్దాం.. కుప్పం నుండి నన్ను పోటీ చేయమంటారా?: నారా భువనేశ్వరి

చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు.

By Medi Samrat  Published on  21 Feb 2024 12:15 PM GMT
చంద్రబాబుకు రెస్ట్ ఇద్దాం.. కుప్పం నుండి నన్ను పోటీ చేయమంటారా?: నారా భువనేశ్వరి

చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాంతిపురంలో మహిళలతో ముచ్చటించిన కార్యక్రమంలో ప్రసంగించారు నారా భువనేశ్వరి. కుప్పంలో తనకు మద్దతిస్తారా లేదా చంద్రబాబుకు మద్దతిస్తారా అంటూ అక్కడున్న వారిని ప్రశ్నించారు. చంద్రబాబును 35 ఏళ్లుగా కుప్పం ప్రజలు గెలిపిస్తున్నారని.. ఈసారి ఆయనకు రెస్ట్ ఇద్దామని భువనేశ్వరి అన్నారు. ఇదే క్రమంలో తనను గెలిపిస్తారా అంటూ సరదాగా వ్యాఖ్యలు చేశారు. అందుకు స్టేజీ మీద కూర్చున్న వాళ్లు.. సభలో ఉన్న ప్రజలంతా నవ్వుతూ చప్పట్లు కొట్టారు.

" ఓ జోక్ వేస్తున్నా. మీ ఆన్సర్లన్నీ ఫ్రీగా ఇవ్వాలి. కుప్పం వచ్చిన తర్వాత నా మనసులో ఓ కోరిక కలిగింది. చంద్రబాబుపై నమ్మకంతో 35 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా చేస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చాక నాకో కోరిక కలిగింది. ఈసారి ఆయనకు రెస్ట్ ఇచ్చి, నేను పోటీ చేద్దామని అనుకుంటున్నా. మీరు ఎవరికి మద్దతిస్తారు. నేను కావాలో, చంద్రబాబు కావాలో చేతులెత్తి చెప్పండి" అంటూ భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇద్దరూ కావాలంటే కుదరదనీ, ఎవరో ఒకరి పేరు మాత్రమే చెప్పాలన్నారు.. అయితే ఆ తర్వాత ఇదంతా సరదాగా అంటున్నానన్న భువనేశ్వరి.. నా మనసుకు నచ్చిన పనిమాత్రమే చేస్తానన్నారు. నాకే పదవులు వద్దని చెప్పారు.

Next Story